విధాత: మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు సర్వం సిద్ధం అవుతోంది. ములుగు (డీ) తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరగనుంది. కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా.
ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులను గద్దెలకు తీసుకొస్తారు.
17 న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల దగ్గరకు తీసుకొస్తారు.
